వ్యభిచారం నిర్వహిస్తున్న ఇళ్లపై దాడి: పలువురి అరెస్టు

28 Oct, 2021 10:02 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి,పంజగుట్ట( హైదరాబాద్‌): గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్న రెండు ప్రాంతాల్లో హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ యూనిట్, సీసీఎస్, పంజగుట్ట పోలీసులు ఆకస్మిక దాడులు చేశారు. ఇద్దరు నిర్వాహకులు, ఇద్దరు విటులు, ముగ్గురు మహిళలను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల సమాచారం మేరకు... కర్నాటకకు చెందిన రాజేష్‌ నాయక్‌ (34) నగరంలో ఫలక్‌నామాలో ఉంటున్నాడు.

ఇతను ఎర్రమంజిల్, హిల్‌టాప్‌ కాలనీలో ఓ భవనంలో ఫ్లాట్‌ను అద్దెకు తీసుకుని వ్యభిచారం నిర్వహిస్తున్నాడని సీసీఎస్‌ పోలీసులు పక్కా సమాచారం అందుకున్నారు. మంగళవారం రాత్రి దాడి చేసి నిర్వాహకుడు రాజేష్‌నాయక్‌తో పాటు ఇద్దరు కస్టమర్లు, ఇద్దరు సెక్స్‌ వర్కర్లను అదుపులోకి తీసుకున్నారు. రాజేష్‌ నాయక్‌ను విచారించగా శ్రీనగర్‌కాలనీలో ఓ అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్‌ అద్దెకు తీసుకుని ఈస్ట్‌గోదావరి జిల్లాకు చెందిన కె.రాము(28) కూడా వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు తెలుసుకుని దానిపై కూడా దాడి చేసి నిర్వాహకుడు రాము, ఒక సెక్స్‌ వర్కర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

చదవండి: Kukatpally:వివాహేతర సంబంధం.. భర్తను రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య 

మరిన్ని వార్తలు