హైదరాబాద్‌-విజయవాడ హైవేపై ప్రమాదం.. పల్టీ కొట్టిన బస్సు...

22 Mar, 2023 08:51 IST|Sakshi

 సూర్యాపేట: మునగాల మండలం మాధవరం వద్ద బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి పల్టీ కొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు ప్రయాణికులకు స్వల్ప గాయలయ్యాయి. 

ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 42 మంది ఉన్నారు. హైదరాబాద్‌ నుంచి విజయవాడ వెళ్తుండగా అదుపుతప్పి ప్రమాదానికి గురైంది. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
చదవండి: టీఎస్‌పీఎస్సీ లీకేజ్‌ కేసులో తెరపైకి కొత్త పేరు.. స్నేహితుడికీ షేర్ చేశాడు!

మరిన్ని వార్తలు