సాక్షి, హైదరాబాద్: పాతబస్తీలోని కాలాపత్తర్లో దారుణం జరిగింది. ప్రేయసితో వీడియోకాల్ మాట్లాడుతూ యువకుడు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రేయసి పెళ్లికి దూరమవుతోందన్న బెంగతో మహ్మద్ తబ్రేజ్ అలీ ఆత్మహత్య చేసుకున్నాడు.
గతంలోనే వీరిరువురి వివాహం నిశ్చయమైంది. అయితే రెండు కుటుంబాల మధ్య తలెత్తిన గొడవల నేపథ్యంలో పెద్దలు పెళ్లిని రద్దు చేశారు. దీంతో యువతితో వీడియో కాల్ మాట్లాడుతూనే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు.
చదవండి: (మహిళా డాక్టర్ ఆత్మహత్య.. అదే కారణమా?.. మరేదైనానా?)