తన భార్యను కరిచిందని కుక్కపై ప్రతీకారం..

3 Jun, 2021 21:33 IST|Sakshi

భోపాల్‌: మధ్య ప్రదేశ్​​లో దారుణం చోటుచేసుకుంది. తన భార్యను పక్కింట్లోని పెంపుడు కుక్క కరిచిందని  రివాల్వర్​తో కాల్చిచంపాడో వ్యక్తి. వివరాలు.. ఇండోర్​లోని సుదామ నగర్​ అపార్ట్​ మెంట్​లో నరేంద్ర విశ్వయ్య అనే వ్యక్తి ఉంటున్నాడు. అతని పక్కింట్లో ఒక వ్యక్తి కుక్కను పెంచుకుంటున్నాడు.

అయితే, అది విశ్వయ్య భార్యను కరిచింది. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన సదరు వ్యక్తి,  వెంటనే తన లైసెన్స్​డ్​ తుపాకి​తో ఆ కుక్కను కాల్చిచంపాడు. దీనిపై ఆ శునకం యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు,  నరేంద్రను అదుపులోకి తీసుకొని జంతువులపై క్రూరత్వంగా ప్రవర్తించడం, లైసెన్స్​గన్​ను దుర్వినియోగం చేయడం వంటి వివిధ సెక్షన్​ల కింద కేసులను నమోదు చేశారు. ఈ సంఘటనపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తామని ఇండోర్​ పోలీసు అధికారి మనీష్​ మహోర్​ తెలిపారు.

పోలీసుల విచారణలో ప్రాథమికంగా ఆ కుక్క ఇది వరకే చాలా మందిని కరిచి, గాయ పర్చిందని తెలింది. ఒక వేళ నిందితుడి వాదనే నిజమైతే శునకం యజమానిపై కూడా చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.  ​

చదవండి: పెళ్లిలో వధువు చేసిన పనికి బిత్తరపోయిన వరుడు!

మరిన్ని వార్తలు