కలికిరి బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా కేసులో విచారణ వేగవంతం

6 Sep, 2021 11:59 IST|Sakshi

మరో ఇద్దరు బ్యాంక్‌ ఉద్యోగులపై సస్పెన్షన్‌ వేటు

సాక్షి, చిత్తూరు: కలికిరి బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా కేసులో విచారణను పోలీసులు వేగవంతం చేశారు. మరో ఇద్దరు బ్యాంక్‌ ఉద్యోగులపై సస్పెన్షన్‌ వేటు పడింది. ఈ కేసులో ఇప్పటివరకు ఆరుగురు బ్యాంక్‌ ఉద్యోగులను సస్పెండ్‌ చేశారు. బదిలీపై వెళ్లిన అసిస్టెంట్‌ మేనేజర్‌ కృష్ణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎన్‌ఆర్‌ఐ ఖాతాల నిధులు కూడా దారి మళ్లించినట్లు పోలీసులు గుర్తించారు. ఇంకా 120 పొదుపు సంఘాల ఖాతాలను విచారించాల్సిఉంది.

ఇవీ చదవండి:
నకిలీ చలాన్ల వ్యవహారం: తిన్నది కక్కిస్తున్నారు!
టీడీపీ విష ప్రచారం: కళ్లకు పచ్చ గంతలు 

మరిన్ని వార్తలు