జేసీ వర్గీయుల బరితెగింపు.. వైఎస్సార్‌సీపీ నేతలపై దాడి

17 Oct, 2022 10:14 IST|Sakshi

సాక్షి, అనంతపురం జిల్లా:  జూటూరులో జేసీ దివాకర్‌రెడ్డి వర్గీయులు రెచ్చిపోయారు. వైఎస్సార్‌సీపీ నేతలపై కత్తులు, కర్రలతో దాడికి  తెగబడ్డారు. ఈ ఘటనలో ఐదుగురికి తీవ్ర గాయాలు కాగా, ఆసుపత్రికి తరలించారు. ఈ రోజు ఉదయం పొలం పనులకు వెళ్తున్న వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలను టార్గెట్‌ చేసుకున్న జేసీ దివాకర్‌రెడ్డి బంధువులు, ఆయన వర్గీయులు విచక్షణ రహితంగా దాడికి పాల్పడ్డారు.

మరిన్ని వార్తలు