జార్ఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి

5 Jan, 2022 12:24 IST|Sakshi

రాంచీ: జార్ఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పాకూర్‌లోని అమ్రపరా ప్రాంతంలో  బస్సు, ట్యాంకర్ ఢీకొన్న ఘటనలో అక్కడికక్కడే ఆరుగురు మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలిస్తున్నారు. పలువురికి గాయాలు అయ్యాయని వారిని స్థానిక ఆస్పత్రికి తరలించామని పాకూర్‌ పోలీసులు పేర్కొన్నారు.

చదవండి: బీజేపీ మాజీ ఎమ్మెల్యేపై మావోయిస్టుల దాడి.. ఇద్దరు బాడీగార్డులు మృతి

మరిన్ని వార్తలు