జంట హత్యల కలకలం: చెల్లెని చంపిందని తల్లిని హత్య చేసిన కొడుకు..

21 Oct, 2021 17:56 IST|Sakshi

సాక్షి, వైఎస్సార్‌ కడప: నగరంలోని నకాశ్‌ వీధిలో జంట హత్యలు కలకలం రేపుతున్నాయి. కూతురు అధిక సమయం మొబైల్‌ చూస్తుందని తల్లి మందలించింది. ఈ క్రమంలో తల్లి ఖుర్షీదా, కూతురు హలీం మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో తీవ్ర ఆవేశానికి లోనైన తల్లి.. కూతురు మెడకు చున్నీ బిగించి హత్యకు పాల్పడింది. 
చదవండి: టీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే తనయుడి నిర్వాకం.. పెళ్లి పేరుతో!

అయితే చెల్లెలు హత్యను చూసి తట్టుకోలేక కుమారుడు జమీర్‌ కోపంతో తల్లి ఖుర్షీదాను కత్తితో పొడిచి చంపాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను రిమ్స్ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. 
చదవండి: సెల్ఫీ వీడియో తీసుకుంటూ యువకుడి బలవన్మరణం 

మరిన్ని వార్తలు