ఎల్బీనగర్‌లో వ్యాపారి కిడ్నాప్‌ కలకలం

3 Jul, 2021 08:57 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: నగరంలోని ఎల్బీనగర్‌లో కిడ్నాప్‌ కలకలం రేపింది. ఎల్బీనగర్‎లో ఉన్న కైఫ్ ట్రేడర్స్ ఉడ్ యజమాని అరిఫ్ అక్బర్‎ను నలుగురు దుండగులు అర్ధరాత్రి కారులో వచ్చి కిడ్నాప్ చేశారు. కిడ్నాప్ అనంతరం మరో కారులో వచ్చిన కొంతమంది షాప్‎లోకి చొరబడి రూ.50 లక్షల విలువైన ఉడ్‎ను ఎత్తుకెళ్లారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి..కేసు నమోదు చేసుకున్నారు. 6 ప్రత్యేక బృందాలతో దుండగుల కోసం గాలిస్తున్నారు. ఆర్థిక లావాదేవీలే కిడ్నాప్‌కి కారణమని పోలీసుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
 

మరిన్ని వార్తలు