సాక్షి, కరీంనగర్: జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఖమ్మం నుంచి కరీంనగర్ వెళ్తున్న కారు మానకొండూరు పోలీస్ స్టేషన్ ప్రాంతంలో అదుపుతప్పి చెట్టును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు మృత్యువాత పడ్డారు. ఒకరికి తీవ్ర గాయలవ్వగా ఆసుపత్రికి తరలించారు. ఖమ్మం జిల్లా కల్లూరులో దశ దినకర్మకు వెళ్లొస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. మృతులు కరీంనగర్లోని జ్యోతినగర్ వాసులుగా పోలీసులు గుర్తించారు.
చదవండి: తెలంగాణలోనూ ఆన్లైన్ టికెట్ విధానం పెట్టండి: నిర్మాత
కారులో ప్రయాణిస్తున్న కొప్పుల శ్రీనివాస రావు, కొప్పుల బాలాజీ శ్రీధర్, ఇందూరి జలంధర్, శ్రీరాజు మృతి చెందగా.. మరో వ్యక్తి పెంచాల సుధాకర్ రావుకు తీవ్రగాయాలైనట్లు పోలీసులు పేర్కొన్నారు. అయితే నిద్రమత్తులో కారు నడపడమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు