లవర్‌ మరో వ్యక్తితో చాట్‌ చేస్తుందని కత్తితోదాడి

24 Apr, 2021 10:26 IST|Sakshi

సాక్షి, బెంగళూరు : మరో వ్యక్తితో చాటింగ్‌ చేస్తున్న తన ప్రియురాలిపై ప్రియుడు హత్యాయత్నం చేసిన ఘటన శుక్రవారం మైసూరులోని శ్రీహర్ష రోడ్డులో జరిగింది. మైసూరు జిల్లా సంజనగూడు శ్రీరాంపురానికి చెందిన సౌమ్య(26) రమేశ్‌లు నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఆమె వాట్సప్‌ను హ్యక్‌ చేసిన రమేశ్‌ ఆ మొబైల్‌ సందేశాలను తన సెల్‌కు వచ్చేలా చేసుకున్నాడు. కొందరు యువకులతో సౌమ్య చాట్‌ చేస్తున్నట్లు రమేశ్‌ గుర్తించాడు. దీంతో ఆమెతో లవ్‌​ బ్రేకప్‌ చేసుకున్నాడు. తిరిగి మాట్లాడాలని నమ్మించి తీసుకెళ్లి కత్తితో పొడిచాడు. తీవ్రంగా గాయపడిన సౌమ్య పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు కేసు నమోదు చేశారు.

చదవండి: యువతితో దిగిన ఫొటోతో స్టేటస్‌.. భార్య చూడటంతో!

మరిన్ని వార్తలు