Karnataka: పేస్ట్‌ అనుకుని గోడపై ఉంచిన ఎలుకల మందుతో పళ్లు తోమి..

1 Mar, 2022 14:51 IST|Sakshi

యశవంతపుర (బెంగళూరు): టూత్‌పేస్ట్‌ అనుకుని ఓ యువతి ఎలుకల మందుతో బ్రష్‌ చేసుకోవడంతో తీవ్ర అస్వస్థతకు గురై మృతి చెందిన ఘటన మంగళూరు జిల్లాలో జరిగింది. సూళ్యకు చెందిన శ్రావ్య (22) సోమవారం ఉదయం నిద్ర లేచింది. బాత్‌రూమ్‌ వెళ్లిన శ్రావ్య టూత్‌ పేస్ట్‌ అనుకుని గోడపై ఉంచిన ఎలుకల మందుతో పళ్లు తోముకుంది. కొద్ది క్షణాల్లోనే అస్వస్థతకు గురైంది. ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. 

చదవండి: (పావనికి ఏం కష్టం వచ్చిందో? రాత్రికి రాత్రి ఏమైంది..)

>
మరిన్ని వార్తలు