మాజీ ప్రియుని హత్య.. మహిళ, రెండవ ప్రియుడు అరెస్టు  

16 Aug, 2021 14:17 IST|Sakshi

సాక్షి, బెంగళూరు: ఈ నెల 5వ తేదీన తాలూకా రామచంద్రపురం అటవీ ప్రాంతంలో ఘజైల్‌ఖాన్‌ అనే వ్యక్తి హత్య కేసులో నిందితులను రూరల్‌ పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు హిందూపురం తాలూకా మద్దిపి గ్రామానికి చెందిన ప్రమీళ (26), ఆమె రెండవ ప్రియుడు సురేశ్‌ (27)లు. ప్రమీళ భర్తను వదిలేసి మొదట్లో హిందూపురంవాసి, ఆటోడ్రైవర్‌ ఘజైల్‌ ఖాన్‌ అలియాస్‌ సుహేల్‌ (24)తో సహజీవనం చేసేది.

అతనితో గొడవలు రావడంతో సురేశ్‌కు దగ్గరైంది. అయినా ఘజైల్‌ఖాన్‌ ఆమెను వేధిస్తుండడంతో సురేశ్‌తో కలిసి రామచంద్రపురం అటవీప్రాంతానికి పిలిపించి హత్య చేసింది. శనివారం రాత్రి నిందితులను అరెస్టు చేసినట్లు రూరల్‌ పోలీసులు తెలిపారు.   

టిప్పర్‌ ఢీకొని మృతి 
క్రిష్ణగిరి: బిహార్‌ రాష్ట్రానికి చెందిన రాజేష్‌కుమార్‌ (44) సూళగిరి దిగువపేటలో నివాసముంటూ టైల్స్‌ వ్యాపారం చేసేవాడు. శనివారం రాత్రి ద్విచక్రవాహనంలో వెళ్తుండగా సూళగిరి సమీపంలోని పవర్‌గ్రిడ్‌ వద్ద టిప్పర్‌ లారీ ఢీకొనడంతో ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. సూళగిరి పోలీసులు కేసు నమోదు చేశారు.   

చదవండి: రాత్రి భోజనం చేసి నిద్రపోయింది.. ఉద‌యం లేచి చూసేస‌రికి..

మరిన్ని వార్తలు