భర్త పరాయి మహిళతో సన్నిహితంగా ఉండటం చూసి తట్టుకోలేక..

17 Jul, 2021 08:53 IST|Sakshi
మృతదేహాన్ని పరిశీలిస్తున్న మధిర సీఐ మురళి

సాక్షి, బోనకల్‌(ఖమ్మం): భర్త పరాయి మహిళతో సన్నిహితంగా ఉండటం చూసి తట్టుకోలేక ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడ్డ సంఘటన బోనకల్‌లో శుక్రవారం తెల్లవారు జామున చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..బోనకల్‌కు చెందిన రావుట్ల శివ, సంధ్య(28)లకు 12ఏళ్ల క్రితం వివా హమైంది. వారికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇటీవల కాలంలో భర్త వేరే మహిళతో సన్నిహితంగా ఉన్న ఫొటోలు చూసి మనస్తాపానికి గురైంది.

ప్రేమించి పెళ్లాడినవాడు మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని ఆలో చిస్తూ ఆవేదన చెందింది. ఈ క్రమంలో శుక్రవారం తెల్లవారుజామున ఇంటిలో ఉరి వేసుకుని మృతి చెందింది. మృతురాలి బంధువుల ఫిర్యా దు మేరకు ఎస్‌ఐ కొండలరావు సంఘటనా స్థలా నికి చేరకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమి త్తం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. భర్త, అత్త మామలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మధిర సీఐ మురళి సంఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. 

మరిన్ని వార్తలు