ఖమ్మంలో తీవ్ర విషాదం

9 Jun, 2021 15:38 IST|Sakshi

 సాక్షి, ఖమ్మం:  ఖమ్మం జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆ ఇంటిలో ఏం జరిగిందో గానీ ఓ తల్లి తన పిల్లలతో సహా నదిలో దూకేసింది. వివరాల్లోకి వెళితే..  బుధవారం ఖమ్మం నగరంలో ఓ తల్లి తన ఇద్దరి పిల్లలు మున్నేరు నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. వాళ్లు నదిలో దుకే సమయంలో చూసిన జాలరులు రక్షించటానికి ప్రయత్నం చేశారు. దురదృష్టవశాత్తు అప్పటికే ఆ ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. కాగా వాళ్ల ఆత్మహత్యకు ఆర్ధిక  ఇబ్బందులే కారణమని అనుమానిస్తున్నారు. మృతులను వనితి , చైతన్య, రోహితలుగా గుర్తించారు.

చదవండి: అధికారి భార్య ఆత్మహత్య 

మరిన్ని వార్తలు