జమ్ముకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్..లష్కరే తొయిబా ఉగ్రవాది హతం

13 Aug, 2021 10:25 IST|Sakshi
ఫైల్‌ ఫోటో

శ్రీనగర్‌: జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు, భద్రతా దళాలకు శుక్రవారం తెల్లవారుజామున ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. కుల్గాం జిల్లాలో బీఎస్‌ఫ్‌ జవాన్లు ప్రయాణిస్తున్న వాహనంపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ క్రమంలో ఉగ్రవాదులకు బద్రతా బలగాలకు మధ్య ఎదురు కాల్పలు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో  లష్కరే తొయిబా ఉగ్రవాదిని  భద్రతా బలగాలు మట్టుబెట్టగా. .మరో ఉగ్రవాది తప్పించుకున్నాడు. ఈ ఘటనలో ఇద్దరు బీఎస్‌ఫ్‌ అధికారులకు, మరో ఇద్దరు స్థానిక పౌరులకు గాయాలయ్యాయి.


 

మరిన్ని వార్తలు