డీజిల్‌ ట్యాంకర్‌ బోల్తా.. ఒకరు మృతి

20 Oct, 2020 16:28 IST|Sakshi

సాక్షి, విజయనగరం: ఆంధ్ర- ఒడిశా సరిహద్దులో జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. డీజిల్ ట్యాంకర్‌కు ఎదురుగా వస్తున్న లారీ దానిని ఢీకొట్టడంతో, ట్యాంకర్‌ బోల్తా పడింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. పి.కోనవలస దుర్గ గుడి సమీపంలో ఈ దుర్ఘటన జరిగింది. ఇక బోల్తా పడిన ట్యాంకర్‌ నుంచి భారీ స్థాయిలో డీజిల్‌ లీకవడంతో, దాని కోసం స్థానికులు బారులు తీరడం గమనార్హం. 

మరిన్ని వార్తలు