హనుమాన్‌ జంక్షన్‌లో లారీ బీభత్సం

15 Jan, 2021 19:27 IST|Sakshi

సాక్షి, కృష్ణా : జిల్లాలోని బాపులపాడు మండలంలో ఓ లారీ బీభత్సం సృష్టించింది. ఆగి ఉన్న వాహనాలను ఢీకొని ఓ వ్యక్తి ప్రాణాన్ని బలితీసుకుంది. ఈ సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. వివరాలు.. బాపులపాడు మండలం, హనుమాన్‌ జంక్షన్‌లో ఓ లారీ వేగంగా వచ్చి ఆగివున్న కారు, రెండు బైక్‌లను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఈదులుగూడెం గ్రామానికి చెందిన మహేష్‌(27) మృతి చెందాడు. మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. దీంతో వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేపట్టారు. లారీ డ్రైవర్‌ మద్యం సేవించి లారీ నడిపినందువల్లే ఈ ప్రమాదం చోటుచేసుకుని ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు