విజయనగరంలో లారీ బీభత్సం: ఇద్దరు మృతి

27 Mar, 2021 09:23 IST|Sakshi

సాక్షి, విజయనగరం: జిల్లాలోని ఆర్టీవో కార్యాలయం వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ లారీ అతివేగంతో రోడ్డు మీద బీభత్సం సృష్టించింది. బైకును ఢీకొట్టిన లారీ సమీపంలోని ఇంట్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో అక్కడికక్కడే ఇద్దరు మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. గాయపడినవారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాని చేరు​కొని మృత దేహాలను స్వాధీనం చేసుకున్నారు. మృతి చెందిన వారిని ఏఆర్ కానిస్టేబుల్‌ రాజు, లెక్చరర్ సంజీవ్‌గా పోలీసులు గుర్తించారు.

 

చదవండి: నర్సింగ్‌ విద్యార్థిని కిడ్నాప్‌: రూ. 2 కోట్లిస్తే వదిలేస్తాం

>
మరిన్ని వార్తలు