మహబూబాబాద్: మైక్‌ సెట్‌ రిపేర్‌ చేస్తుండగా షాక్‌.. ముగ్గురి మృతి

21 Jun, 2022 13:30 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, మహబూబాబాద్: జిల్లాలోని డోర్నకల్ మండలం అందనాలపాడులో విషాదం చోటు చేసుకుంది. గత రాత్రి కురిసిన గాలివానకు గ్రామంలోని రామాలయం గుడిపై ఉన్న మైక్ సెట్ దెబ్బతింది. దెబ్బతిన్న  మైక్ సెట్ సరి చేస్తుండగా.. కరెంట్ షాక్‌తో ముగ్గురు మృతి చెందారు. మృతుల్ని సుబ్బారావు, మస్తాన్ రావు, వెంకయ్యలుగా నిర్ధారించారు. దీంతో ఆ గ్రామంలో విషాదం నెలకొంది.

మరిన్ని వార్తలు