చదువు కోసం చెట్టెక్కిన విద్యార్థులు..

3 Jul, 2021 22:08 IST|Sakshi

ముంబై: కరోనా కారణంగా స్కూళ్లు మాతపడిన విషయం తెలిసిందే. ఆన్‌ లైన్‌ క్లాస్‌లు కోసం విద్యార్ధులు పడుతున్న బాధలు వర్ణనాతీతం. మహారాష్ట్ర లోని అనేక గ్రామీణ ప్రాంతాల్లో నెట్ వర్క్ సరిగా లేక విద్యార్ధులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో గోండియా జిల్లాలోని మూరుమూల గ్రామానికి చెందిన విద్యార్థులు మొబైల్‌ సిగ్నల్‌ కోసం గ్రామానికి 18 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక చెట్టు వద్దకు వెళ్లి  ఆ చెట్టు ఎక్కి తమ మొబైల్‌ ఫోన్లలో ఆన్‌లైన్‌ క్లాసులు వింటున్నారు.

 మొబైల్‌ టవర్‌కు 200 మీటర్ల ఉన్న ఈ చెట్టును నెట్‌వర్క్‌ ట్రీగా వారు పిలుస్తారు. గత 15 నెలల్లో సుమారు 150 మంది గ్రామీణ విద్యార్థులు ఈ చెట్టు వద్దకు వచ్చి ఆన్‌లైన్‌ క్లాసులు విన్నట్లు స్థానికులు తెలిపారు.ఒక వైపు కేంద్ర ప్రభుత్వం డిజిటల్ ఇండియా అడుగులు వేస్తుంటే ..మరో వైపు ఇటువంటి సంఘటనలు జరగడం మన దేశ దౌర్భాగ్యాన్నీ ప్రతిబింబిస్తోందని స్థానికులు  అంటున్నారు.

>
మరిన్ని వార్తలు