ఛీ! ఇదేం పాడు బుద్ధి సుందర్రాజు

27 Jan, 2021 13:14 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

కోయంబత్తూర్‌ : పొరుగిల్లలోని బాత్‌రూముల్లోకి దొంగతనంగా ప్రవేశించి మహిళల లోదుస్తులను పాడుచేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ సంఘటన తమిళనాడులోని కోయంబత్తూర్‌లో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కొట్టుచెర్రికి చెందిన 38 ఏళ్ల సుందర్రాజు కోయంబత్తూర్‌లోని ఒక్కిలిపాళియంలో భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. అదే ప్రాంతంలో రూము తీసుకుని తోటి కార్మికులతో కలిసి ఉంటున్నాడు. చదవండి :  ‘నువ్వు ఆడా.. మగా? నీ గొంతు కుక్కలా ఉంది’

అయితే గత ఐదు రోజులనుంచి పొరుగిల్లలోని బాత్‌రూముల్లోకి దొంగతనంగా ప్రవేశించి మహిళల లోదుస్తులను పాడు చేయటం మొదలుపెట్టాడు. ఇది గమనించిన కొంత మంది మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సుందర్రాజును అరెస్ట్‌ చేశారు.

మరిన్ని వార్తలు