పట్టపగలు నడిరోడ్డుపై దారుణం

12 Sep, 2020 12:18 IST|Sakshi
వీడియో దృశ్యం

నోయిడా :  పట్టపగలు.. నడిరోడ్డుపై వ్యక్తుల మధ్య చోటుచేసుకున్న గొడవ హత్యకు దారితీసింది. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్‌లోని నోయిడాలో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గ్రేటర్‌ నోయిడాలో గత మంగళవారం శేరు అనే వ్యక్తి స్నేహితుడి ఆటోలో వెళుతున్నాడు. ఆ సమయంలో ఓ కారు ఆటోను తగిలింది. దీంతో కారులో ఉన్న ఝమ్‌షద్‌ అనే వ్యక్తిని శేరు కొట్టాడు. ఈ నేపథ్యంలో ఝమ్‌షద్, అతడి‌ వెంట ఉన్న మరో ఇద్దరు శేరుపై దాడి చేసి పట్టపగలు.. నడిరోడ్డుపై.. అందరూ చూస్తుండగా కత్తితో పొడిచి అక్కడినుంచి పరారయ్యారు. ( పెళ్లైన 20 రోజులకే భర్తను చంపిన భార్య )

ఆ సమయంలో శేరు వెంట ఉన్న అతడి మిత్రుడ్ని చంపుతామని బెదిరించి ఈ దారుణానికి పాల్పడ్డారు. అనంతరం శేరును ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో అతడు మరణించాడు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ రికార్డులు బయటకు రావటంతో ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.  ఝమ్‌షద్‌తోపాటు మరొకరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

మరిన్ని వార్తలు