సాక్షి, రంగారెడ్డి : జిల్లాలోని చౌదరి గూడెం కాస్లాబాద్ గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తిని హత్య చేసిన దుండగులు శరీర భాగాలను మూడు ముక్కలుగా కోసి, తల ఓ చోట, మొండాన్ని గోనె సంచిలో పెట్టి, కాళ్లను మరో చోట పడేశారు. హత్య జరిగిన మూడు రోజుల తర్వాత ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతుడ్ని కాస్లాబాద్ గ్రామానికి చెందిన తట్టెపల్లి రాజుగా గుర్తించారు. హత్యకు దారి తీసిన కారణాలపై పోలీసులు దృష్టి సారించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ కృష్ణ తెలిపారు.
చదవండి : మగబిడ్డ కోసం అత్తాకోడళ్ల దారుణం