దారుణం: ఎంగిలి పల్లెం విసిరాడని చిన్నాన్నను..

27 Feb, 2021 14:18 IST|Sakshi
నరేంద్ర సాహు మృతదేహం

భువనేశ్వర్‌ : తనపై ఎంగిలి పల్లెం విసిరాడన్న కారణంతో సొంత చిన్నాన్ననే గొంతుకోసి చంపాడో ప్రబుద్ధుడు. ఈ దుర్ఘటన సదర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని లంజియా గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. రాత్రి భోజనం చేస్తున్న సమయంలో ఏదో విషయమై నరేంద్ర సాహు తన అన్నకొడుకు శిబరామ్‌ సాహుల మధ్య కొంత వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో ఒకనొక దశలో కోపంతో ఊగిపోయిన నరేంద్ర సాహు తన దగ్గరి ఎంగిలి పల్లెం శిబరామ్‌ సాహుపైకి విసిరాడు. దీంతో కోపోద్రేకుడైన శిబరామ్‌ తన దగ్గరి కత్తితో చిన్నాన్న గొంతుకోసి చంపాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు శిబరామ్‌ని అరెస్ట్‌ చేసి, స్టేషన్‌కి తరలించారు. హత్యకి గల పూర్తి కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని ఐఐసీ అధికారి సంతోషినీ హోరాం తెలిపారు.

మరిన్ని వార్తలు