ప్రాణం తీసిన వివాహేతర సంబంధం 

7 Mar, 2021 07:33 IST|Sakshi
రాజ్‌కుమార్‌

చెన్నై : వివాహేతర సంబంధం ఓ మహిళ ప్రాణం తీసింది. ఈ ఘటన తిరువలంగాడు ప్రాంతంలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. తిరువలంగాడు సమీపం మెన్నవేడు గ్రామానికి చెందిన ఆటోడ్రైవర్‌ రాజ్‌కుమార్‌‌. ఇతని భార్య ప్రియాంక. వీరికి ఇద్దరు పిల్లలు. ప్రియాంక నార్తవాడా గ్రామానికి చెందిన కార్తిక్‌‌ (27)తో వివాహేతర సంబంధం ఏర్పరుచుకుంది. విషయం తెలిసిన రాజ్‌కుమార్‌ కూల్‌డ్రింక్స్‌లో పురుగుల మందు కలిపి.. ప్రియాంక చేతులు కట్టి నోట్లో పురుగుల మందు పోసి హత్య చేశాడు. పోలీసులు రాజ్‌కుమార్‌ను అరెస్ట్‌ చేశారు.

>
మరిన్ని వార్తలు