కృష్ణా జిల్లాలో దారుణం: భార్య, కుమారుడిపై గొడ్డలితో దాడి

4 Jun, 2021 08:05 IST|Sakshi

భార్య మృతి, కుమారుడి పరిస్థితి విషమం

సాక్షి, కృష్ణా జిల్లా: తిరువూరు మండలం టేకులపల్లిలో దారుణం చోటు చేసుకుంది. భార్య, కుమారుడిపై సత్యనారాయణరెడ్డి అనే వ్యక్తి అతి కిరాతకంగా గొడ్డలితో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో భార్య పద్మావతి అక్కడికక్కడే మృతి చెందగా, కుమారుడు నర్సిరెడ్డి పరిస్థితి విషమంగా ఉంది. విజయవాడ ఆస్పత్రికి తరలించారు. హత్య అనంతరం బైకుపై సత్యనారాయణరెడ్డి పరారయ్యాడు. రెడ్డిగూడెం శివారులో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

చదవండి: కళ్లలో కారం చల్లి కత్తులతో నరికారు..
లైంగిక వేధింపులు: బయటపడ్డ కీచక బాబా లీలలు 

>
మరిన్ని వార్తలు