మైలార్‌దేవ్‌పల్లిలో వ్యక్తి దారుణ హత్య

1 Apr, 2021 16:46 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాజేంద్రనగర్ డివిజన్‌ మైలార్‌దేవ్‌పల్లి పీఎస్‌ పరిధిలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురైయ్యాడు. అసద్‌ఖాన్‌ అనే వ్యక్తిని దుండగులు కత్తులతో పొడిచి చంపారు. ఇండియా ఫంక్షన్ హాల్ సమీపంలో ఈ ఘటన జరిగింది. మృతుడు అసద్‌ఖాన్‌ ఓ హత్య కేసులో నిందితుడని.. ప్రత్యర్థులు హతమార్చి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న క్లూస్ టీం చేరుకుంది. సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రాజేంద్రనగర్‌లో రెండు నెలలుగా వరుస హత్యలతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు.

చదవండి:
హైదరాబాద్‌లో బయటపడుతున్న వేల కోట్ల బ్లాక్‌మనీ
నాంపల్లి హైకోర్టుకు హాజరైన విజయశాంతి

మరిన్ని వార్తలు