దోపిడి చేసేందుకు వచ్చి కాల్పుల వీరంగం

9 Oct, 2022 14:50 IST|Sakshi

న్యూఢిల్లీ: ఒక దుండగుడు దుకాణం వద్దకు వచ్చి  కాల్పుల కలకలం సృష్టించాడు. ఈ ఘటన ఢిల్లీలోని దరీపూర్‌లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం...ఢిల్లీలోని ఒక గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు మోటార్‌ బైక్‌ పై దుకాణం వద్దకు వచ్చి గాల్లో కాల్పులు జరిపారు. ఆ తర్వాత ఆ ఇద్దరు దుండగులు షాపులోకి వెళ్లి యజమానిని భయబ్రాంతులకు గురిచేసి  దాదాపు రూ. 50 లక్షలు ఇవ్వాల్సిందిగా డిమాండ్‌ చేసినట్ల తెలిపారు.

షాపు యజమానిని భయపట్టేందుకు ఆ దుండగులు ఇలా గాల్లో కాల్పులు జరిపి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఐతే ఈ ఘటన మొత్తం దుకాణం వద్ద ఉన్న సీసీఫుటేజ్‌లో రికార్డు అయ్యింది. దీంతో పోలీసులు యజమాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

(చదవండి: నకిలీ వెబ్‌సైట్‌లతో చీటింగ్‌... 12 మంది అరెస్టు)

మరిన్ని వార్తలు