యువకుడిపై కేసు నమోదు

2 Jul, 2021 13:43 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, సంగెం(వరంగల్‌): మండలంలోని చింతలపల్లి గ్రామానికి చెందిన యుడికుడిపై పోక్సో చట్టంతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు ఎస్సై సురేష్‌ తెలిపారు. చింతలపల్లికి చెందిన వేల్పుల రాకేష్‌ అదే గ్రామానికి చెందిన దళిత సామాజిక వర్గానికి చెందిన మైనర్‌ బాలికను గత 9 నెలలుగా ప్రేమిస్తున్నానని వివాహం చేసుకుంటానని నమ్మించి లైంగికదాడికి పాల్పడ్డాడు.

ఇప్పుడు వివాహానికి నిరాకరించడంతో బాలిక, ఆమె తల్లిదండ్రులు గ్రామపంచాయతీ వద్దకు పిలిపించగా, రాకేష్‌ ఆయన సోదరులు రవి, అశోక్, తల్లి లచ్చమ్మ కులం పేరుతో దూషించారు. అనంతరం నిందితుడి ఇంటికి వెళ్లితే అక్కడా దూషించడమే కాకుండా బాలిక ఇంటిపై దాడి చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు రాకేష్‌పై పోక్సో, ఎస్సీఎస్టీ అట్రాసిటీ,  పాటుగా సోదరులు, తల్లిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి మామునూర్‌ ఏసీపీ నరేష్‌కుమార్‌ దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సురేష్‌ పేర్కొన్నారు.

చదవండి: కొంపముంచిన కాంట్రాక్టర్‌ నిర్లక్ష్యం.. 

మరిన్ని వార్తలు