ప్రేయసిని దోచేసిన ప్రియుడు

24 Mar, 2021 05:00 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

102గ్రాముల బంగారు నగలు స్వాధీనం

సాక్షి, బెంగళూరు: తన ప్రియురాలు మరొకరితో తిరుగుతోందన్న కక్షతో ఓ ప్రియుడు తన ఇద్దరు స్నేహితులతో కలిసి ఆమెను నిలువు దోపిడీ చేశాడు. నగరానికి చెందిన జాకీర్‌ హుసేన్‌ అనే వ్యక్తి ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. అయితే ఆమె కొంతకాలంగా మరొకరితో తిరుగుతోందని కక్ష పెంచుకున్నాడు. ఈక్రమంలో ఆ యువతి ఈనెల 13న చంద్రలేఔట్‌ భైరవేశ్వరనగర్‌ వద్ద వెళ్తుండగా దుండగులు ఆమెను అడ్డగించి రూ.3లక్షల విలువైన 102 గ్రాముల బంగారు నగలు దోచుకున్నారు. బాధిత యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు జాకీర్‌హుసేన్, షాబాజ్‌ఖాన్, ఫాజిల్‌ అనే వ్యక్తులను అరెస్ట్‌ చేసి నగలు స్వాధీనం చేసుకున్నారు. తనను విస్మరిస్తోందనే కక్షతోనే స్నేహితులతో కలిసి దోపిడీకి పాల్పడినట్లు జాకీర్‌హుసేన్‌ విచారణలో వెల్లడించాడని పోలీసులు తెలిపారు. 

మరిన్ని వార్తలు