పెళ్లి చేసుకుంటానని నమ్మించి తల్లిని చేశాడు

25 Apr, 2021 14:59 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, ఇల్లెందు: మండలంలోని మాణిక్యారం గ్రామానికి చెందిన ఓ మహిళను మోసగించిన వ్యక్తిపై కాచనపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్‌ఐ శ్రీధర్‌ కథనం ప్రకారం... మాణిక్యారం గ్రామానికి చెందిన అశోక్‌ అదే గ్రామానికి చెందిన ఉష అనే మహిళను పెళ్లి చేసుకుంటానని నమ్మించి, తల్లిని చేశాడు.

పెళ్లి చేసుకోకపోవడంతో బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. కాగా ఈ నేపథ్యంలో ఎన్డీ చంద్రన్న వర్గం నేతగా పని చేస్తున్న నిందితుడిని ఆ పార్టీ ఇటీవల బహిష్కరించింది.  

చదవండి: పట్టపగలు ప్రభుత్వ ఆసుపత్రిలో వార్డుబాయ్‌ దారుణం..

మరిన్ని వార్తలు