అన్నంలో విషం కలిసి.. తల్లి, సోదరి దారుణ హత్య

30 Nov, 2020 09:03 IST|Sakshi
నిందితుడు సాయినాథ్‌ రెడ్డి (ఫైల్‌ఫోటో)

సాక్షి, మేడ్చల్ : ఐపీఎల్ బెట్టింగ్‌లకు, జల్సాలకు బానిసైన యువకుడు తల్లికి, సోదరికి విషం హతమార్చిన  సంఘటన వెలుగులోకి వచ్చింది.  పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రావలకోల్ గ్రామానికి చెందిన సాయినాథ్‌రెడ్డి తండ్రి ప్రభాకర్ రెడ్డి ఇటీవల అకాల మరణ​ చెందడంతో అతడి పేరిట ఉన్న ఇన్సూరెన్స్ 20 లక్షలు నగదు అందింది. ప్రైవేటు ఉద్యోగం చేస్తున్న సాయినాథ్‌ రెడ్డి దురలవాట్లకు బానిసయ్యాడు. జులాయిగా తిరుగుతూ మొత్తం డబ్బులను ఖర్చు చేశాడు. ఈ విషయంపై తల్లి, చెల్లిలు ఎక్కడ నిలదీస్తారోనని భయపడిన అతను ఈ నెల 23న ఉదయం అన్నం వండి అందులో విషం కలిపి తల్లి సునీతా రెడ్డి (42), సోదరి అనూష (20)లకు పెట్టాడు. (విషాదం: హెచ్‌సీయూ ప్రొఫెసర్‌ ఆత్మహత్య)

పథకం ప్రకారం ముందే సిద్ధం చేసుకున్న ఆహారాన్ని తీసుకుని ఆఫీసుకు వెళ్లాడు. మధ్యాహ్నం అన్నం తిన్న సునీత, అనూష అస్వస్థతకు గురయ్యారు. తల్లి సునీత కుమారుడికి ఫోన్‌ చేసి ఆ తిన్నం తినవద్దని చెప్పింది. 23వ తేదీ సాయంత్రం ఇంటికి తిరిగివచ్చిన సాయినాథ్‌ రెడ్డి అపస్మారక స్థితిలో ఉన్న తల్లి, చెల్లిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సునీత 27న మృతిచెందగా.. అనుష 28మ కన్నుమూసింది. ఈ ఘటనపై తమకు ఫిర్యాదు అందిందని దర్యాప్తు చేస్తున్నట్లు స్థానికి సీఐ ప్రవీణ్‌రెడ్డి తెలిపారు. నిందితుడు సాయిని అరెస్ట్‌ చేసిన పోలీసులు పోలీస్‌ కస్టడీకి తరలించి విచారిస్తున్నారు.

మరిన్ని వార్తలు