లక్నో : యాభై ఏళ్ల విధవరాలైన మహిళపై అత్యాచారం జరిపి, గర్భానికి కారణమయ్యాడో వ్యక్తి. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్లోని కోత్వాలి సిటీలో ఆలస్యంగా వెలుగుచూసింది. బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్న వివరాల మేరకు.. ఉత్తర ప్రదేశ్లోని కోత్వాలికి చెందిన అఖిలేష్ అహిర్వర్ అనే వ్యక్తి గత నెల డిసెంబర్ 7వ తేదీన బాధితురాలి ఇంట్లోకి చొరబడ్డాడు. అనంతరం ఆమెపై బలాత్కారం చేశాడు. దీంతో సదరు మహిళ గర్భం దాల్చింది. దీనిపై నిందితుడ్ని నిలదీయగా చంపుతానని బెదిరించాడు. ఈ నేపథ్యంలో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. అతడిపై అత్యాచారం కేసు పెట్టింది. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు మహిళను వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు.