బాలికపై యువకుడి లైంగిక దాడి

21 Aug, 2020 09:34 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కుల్సుంపురా పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకున్న దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాలికతో పరిచయం పెంచుకున్న ఓ యువకుడు పలుమార్లు ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అంతేగాక ఈ విషయం బయటకు చెబితే చంపేస్తానంటూ బెదిరింపులకు దిగాడు. దీంతో బాధితురాలి కుటుంబం పోలీసులను ఆశ్రయించింది. వివరాలు.. స్థానికంగా పలుకుబడి ఉన్న ఓ రాజకీయ నాయకుడి కుమారుడైన రోహన్‌ అనే యువకుడు బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న ఓ బాలికతో పరిచయం పెంచుకున్నాడు. మాయమాటలు చెప్పి, బలవంతంగా నిద్ర మాత్రలు మింగించి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.(20 ఏళ్ల వ్య‌త్యాసం.. ప్రియుడితో క‌లిసి భ‌ర్తను)

ఈ విషయం తెలుసుకున్న బాధితురాలి కుటుంబ సభ్యులు అతడిని నిలదీయడంతో వారిపై కక్షగట్టాడు. తన అకృత్యం గురించి బయటపెడితే బాధితురాలిని చంపేస్తానంటూ బెదిరించాడు. ఈ నేపథ్యంలో రోహన్‌ కారణంగా తమకు ప్రాణహాని ఉందంటూ బాధిత బాలిక కుటుబీకులు కుల్సుంపుర పోలీస్‌ స్టేషన్‌లో ఆగష్టు 12న ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.(‘మహా నగరంలో మాయగాళ్లు’)

మరిన్ని వార్తలు