సులభ్‌ కాంప్లెక్స్‌లోకి తీసుకెళ్లి బాలికపై అత్యాచారం..

23 Mar, 2022 11:26 IST|Sakshi

సాక్షి, రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లా మీర్‌పేట్‌ పోలీస్‌ స్టేషన్‌  పరిధిలో దారుణం చోటుచేసుకుంది. బడంగ్పేట్‌లో స్థానికంగా ఉండే పండ్ల వ్యాపారి కూతురుపై పక్కనే ఉండే సులభ్‌ కాంప్లెక్స్‌లో పనిచేసే వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. రవిందర్‌ అనే వ్యక్తి 10 ఏళ్ల బాలికను సులభ్‌ కాంప్లెక్స్ లోపలికి తీసుకెళ్లి న్యూడ్ వీడియో చూపిస్తూ అఘాయిత్యానికి ఒడిగట్టాడు. 

అయితే ఇంతలో తన కూతురు కనపడటం లేదని గుర్తించిన తల్లి.. అనుమానంతో సులభ్‌ కాంప్లెక్స్‌లోకి వెళ్లి వెతకగా చిన్నారి ఏడుపు వినిపించింది. వెంటనే డోర్‌ తీయడంతో రవిందర్‌ అక్కడి నుంచి పారిపోయేందుకు యత్నించాడు. దీంతో నిందితుడిని పట్టుకున్న స్థానికులు అతన్ని చితకబాదారు. అనంతరం మీర్‌పేట్‌ పోలీసులకు అప్పగించారు.
చదవండి: ఇద్దరితోనూ సన్నిహితం.. అక్కపై మరిగిన నూనె పోసిన చెల్లెలు

మరిన్ని వార్తలు