తూర్పుగోదావరి జిల్లాలో దారుణం

2 Aug, 2021 10:40 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

వ్యక్తిని కర్రతో కొట్టి చంపిన యువకుడు

సాక్షి, తూర్పుగోదావరి: రాజోలు మండలం చింతలపల్లిలో దారుణం చోటుచేసుకుంది. ఒక వ్యక్తిని యువకుడు కర్రతో కొట్టి చంపాడు. తన కుమార్తె పట్ల భాస్కర్‌ అనే యువకుడు అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని అతని తల్లిదండ్రులకు తండ్రి మార్లపూడి సురేష్‌ ఫిర్యాదు చేశాడు. తన తల్లిదండ్రులకు ఫిర్యాదు చేశాడనే కోపంతో సురేష్‌పై ఆ యువకుడు కర్రతో దాడి చేశాడు. దీంతో సురేష్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు