ఏడో అంతస్తు నుంచి ఒక్కసారిగా పడిపోయిన లిఫ్ట్.. 8 మంది కార్మికులు దుర్మరణం

14 Sep, 2022 14:35 IST|Sakshi

అహ్మదాబాద్‌: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఘోర ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న భవనంలో లిఫ్ట్ కూలి 8 కార్మికులు దర్మరణం చెందారు. బుధవారం ఉదయం ఈ దుర్ఘటన జరిగింది. గుజరాత్ యూనివర్సిటీ క్యాంపస్‌ సమీపంలో ఈ నిర్మాణ పనులు జరుగుతున్నాయి.

8 మంది కార్మికులను మోస్తున్న లిఫ్ట్‌ ఏడో అంతస్తు నుంచి ఒక్కసారిగా కిందకు పడిపోయినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని డీసీపీ లవీనా సిన్హా వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పేర్కొన్నారు.
చదవండి: పెళ్లింట విషాదం.. శోభనం గదిలో వరుడు మృతి.. ఏం జరిగింది?

మరిన్ని వార్తలు