ప్రాణం తీసిన ‘ఆటో ప్రయాణం’ .. నా చావును కోరుకుంటున్నారు కదా.. మీ కోరిక తీరుస్తా’

28 May, 2022 14:29 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, హైదరాబాద్‌: జీవితంలో ఏ తప్పూ చేయలేదు.. అనుకోకుండా జరిగిన సంఘటనను అడ్డుపెట్టుకుని కోపం తీర్చుకుంటున్నారు.. నా చావును కోరుకుంటున్నారు కదా.. మీ కోరిక తీరుస్తా.. అంటూ సూసైడ్‌ నో­ట్‌రాసి ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల సమాచారం మేరకు... అమలాపురానికి చెందిన సంధ్య(19) వివాహం ఏడాది క్రితం మేనమామ వరసయ్యే మీర్‌సాహెబ్‌తో జరిగింది. మీర్‌సాహెబ్‌ కార్పెంటర్‌గా పనిచేస్తూ భార్యతో కలిసి కార్మికనగర్‌లోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నాడు. కొన్నిరోజులుగా వీరి మధ్య గొడవలు జరుగుతున్నాయి.

గురువారం సాయంత్రం సంధ్య తన తల్లితో కలిసి ఆటోలో మూసాపేట నుంచి ఇంటికి వచ్చింది. అయితే ఆ ఆటోలో ఎందుకు వచ్చావంటూ ఆమెపై భర్త కోప్పడ్డాడు. దీంతో ఇద్దరి మధ్య వాదన జరిగింది. అడ్డు వచ్చిన అత్తపై మీరాసాహెబ్‌ చేయి చేసుకోవడంతో పాటు దుర్భాషలాడాడు. రాత్రంతా ఇదే విషయంపై భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. ఏ తప్పూ చేయలేదంటూ సంధ్య వాదనకు దిగింది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో భర్తను ఉద్దేశించి సూసైడ్‌ నోట్‌ రాసిన సంధ్య గదిలో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. జూబ్లీహిల్స్‌ పోలీసులు  సూసైడ్‌ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు.
చదవండి: అనన్యా .. సారీ! నువ్వు నాతో సంతోషంగా బతకలేవు

ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్‌ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. 
ఫోన్‌ నెంబర్లు: 040-66202000/040-66202001
మెయిల్: roshnihelp@gmail.com

మరిన్ని వార్తలు