కొత్తపల్లి (తూర్పుగోదావరి): ఒక వివాహిత మృతికి కారణమైన ఐదుగురిపై వరకట్న వేధింపుల కేసు నమోదు చేసినట్టు ఆదివారం పోలీసులు తెలిపారు. కొండెవరం గ్రామానికి చెందిన మేడిశెట్టి రాంబాబుకు జగ్గంపేట మండలం నరేంద్రపట్నం గ్రామానికి చెందిన శిరీష(29)కు రెండేళ్ల క్రితం వివాహం అయింది. కొంతకాలంగా కుటుంబ సభ్యులు ఆమెను అదనపు కట్నం కోసం వేధించడమే కాకుండా చిత్రహింసలకు గురి చేస్తున్నారు.
చదవండి: ఎవరు? ఎందుకు?
మనస్థాపానికి గురైన శిరీష శనివారం రాత్రి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె సోదరుడు బుర్రే క్రాంతి కిరణ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు భర్త మేడిశెట్టి రాంబాబు, అత్తమామలు నాగమణి, నారయ్య, ఆడపడుచు భవాని, ఆమె భర్త సత్యానందంపై వరకట్నం వేధింపుల కేసును నమోదు చేశారు. పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో తహసీల్దారు ప్రసాద్ పర్యవేక్షణలో పోస్టుమార్టం నిర్వహించారు. కొండెవరంలో రాంబాబు ఇంటిని డీఎస్పీ భీమారావు పరిశీలించారు. ఆయన వెంట సీఐ వైఆర్కే శ్రీనివాస్, ఎస్సై అబ్దుల్ నబీ ఉన్నారు.
ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి.
ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001
మెయిల్: roshnihelp@gmail.com