బయటికి వెళ్లి తిరిగి వచ్చేసరికి.. భర్త ఒక్కసారిగా షాక్‌

7 Jun, 2021 11:22 IST|Sakshi

వివాహిత ఆత్మహత్య 

కర్నూలు: మండలంలోని సూదిరెడ్డిపల్లె సమీపంలోని స్కంద వెంచర్‌లో నివాసం ఉంటున్న ఓ వివాహిత కుటుంబ కలహాల కారణంగా ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. బనగానపల్లెకు చెందిన మధుమోహన్‌కు కర్నూలుకు చెందిన జోత్స్న (28)తో పదేళ్ల క్రితం వివాహమైంది. మధుమోహన్‌ హైదరాబాదులో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరుగా ఉద్యోగం చేస్తున్నాడు.

ఇటీవలే స్కంద వెంచర్‌లో నూతన గృహం కొనుగోలు చేసి భార్యతో కలిసి నివాసం ఉంటున్నాడు. కుటుంబ కలహాల కారణంగా భార్యాభర్తలు గొడవపడ్డారు. ఆదివారం ఉదయం భర్త బయటికి వెళ్లి తిరిగి వచ్చేసరికి ఇంట్లో ఉరి వేసుకుని వేలాడుతూ కనిపించింది. కిందికి దించేసరికి ఆమె అప్పటికే మరణించింది. కర్నూలు అర్బన్‌ తాలుకా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

చదవండి: వ్యభిచారం చేయకపోతే చంపేస్తామంటూ...
వ్యభిచార గృహంపై పోలీసుల దాడి

మరిన్ని వార్తలు