బాలికపై అత్యాచారం.. తండ్రి, చిన్నారి హత్య

4 Feb, 2021 10:15 IST|Sakshi

ఛత్తీస్‌గడ్: పదహారేళ్ల మైనర్‌ బాలికను దారుణంగా అత్యాచారం చేసి రాళ్లతో కొట్టి హత్య చేసిన ఘటన ఛత్తీస్‌గడ్‌ రాష్ట్రంలో అలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో మైనర్‌ బాలిక వెంట ఉన్న ఆమె తండ్రిని, అతని మనవరాలైన మరో చిన్నారిని నిందితులు హతమార్చినట్లు కోబ్రా ఎస్పీ అభిషేక్‌ మీనా తెలిపారు. గత నెల జనవరి29న లెమ్రూ పోలీస్ స్టేషన్ పరిధిలోని గదుప్రోడా గ్రామం చోటు చేసుకున్నట్లు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హత్యకు గురైన వ్యక్తి, ప్రధాన నిందితుడైన సాంట్రామ్‌ మజ్వర్‌ వద్ద పశువుల కాపరిగా పనిచేస్తున్నాడు. అయితే జనవరి 29న రోజున సాంట్రామ్‌ మజ్వర్‌ ఆ వ్యక్తిని, అతని కుమార్తె, మనవరాలని తన బైక్‌మీద వారి ఇంటి వద్ద దింపడానికి బయలుదేరాడు. మార్గమధ్యలో మద్యం కొనుగోలు చేసి తన స్నేహితుడితో కలిసి 16ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి అడ్డు వచ్చిన ఆమె తండ్రిని, మనవరాలైన మరో చిన్నారిని రాళ్లు, కర్రలతో కొట్టి సమీపంలోని అడవిలో వదిలేసి వెళ్లిపోయారు. మృతి చెందిన వ్యక్తి కుమారుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘాతుకం వెలుగులోకి వచ్చింది.

దర్యాప్తులో భాగంగా ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులకు హత్యాచారానికి గురైన బాలిక కొనఊపిరితో కనిపించటంతో ఆమెను ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందినట్లు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ ఘటనలోని నిందితులు సాంట్రామ్ మజ్వర్ (45), అబ్దుల్ జబ్బర్ (29), అనిల్ కుమార్ సార్తి (20), పర్దేషి రామ్ పానికా (35), ఆనంద్ రామ్ పానికా (25), శంకర్ యాదవ్ (21)లను అరెస్ట్‌ చేసినట్లు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు