తల్లికి అనారోగ్యం.. మందులు ఇప్పిస్తానని చెప్పి బాలికపై లైంగిక దాడి

26 Jan, 2022 19:35 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

న్యూఢిల్లీ: తల్లికి ఆరోగ్యం సరిగా లేకపోవడంతో మందుల కోసం సహాయం కోరిన బాలికపై ఓ పొరుగు వ్యక్తి లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన దేశరాజధాని ఢిల్లీలో చోటు చేసుకుంది. ఈ దారుణం జనవరి 22న చోటు చేసుకోగా మరుసటి రోజు కేసు నమోదైంది. వివరాల ప్రకారం.. ఢిల్లీలోని పాండవ్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఓ బాలిక తల్లి అస్వస్థతకు గురైంది. ఆ సమయంలో బాలిక తండ్రి కూడా ఇంట్లో లేడు.

దీంత ఆ బాలిక తల్లికి మందుల కోసం ఆ ప్రాంతాంలోనే నివసిస్తున్న అరుణ్‌ అనే వ్యక్తిని సహాయం చేయాలని కోరింది. అందుకు అంగీకరించిన అరుణ్‌ బాలికకు మందులు ఇప్పిస్తానని చెప్పి ఆ ప్రాంతం నుంచి దూరంగా తీసుకెళ్లి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అంతేగాక, ఈ విషయం బయటకు తెలిస్తే ఆమెను చంపేస్తానని బెదిరించి అక్కడి నుంచి పారిపోయాడు. అనంతరం బాలిక ఈ విషయాన్ని తల్లిదండ్రులకు తెలపడంతో వారు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉండగా, కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. 

( చదవండి: ఒక్క క్షణం ఆలోచించి ఉంటే.. ఈ విషాదం ఉండేది కాదు! )

మరిన్ని వార్తలు