గుంటూరు జిల్లాలో తల్లీ, కూతురు దారుణ హత్య

28 Aug, 2021 20:20 IST|Sakshi
గుంటూరు జిల్లాలో తల్లీ, కూతురు దారుణ హత్య

సాక్షి, గుంటూరు: సత్తెనపల్లి నాగార్జున నగర్‌లో దారుణం జరిగింది. తల్లీ, కుమార్తె హత్యకు గురయ్యారు. విజన్ స్కూల్ సమీపంలో తల్లీ, కుమార్తెలను దుండగుడు పొడిచి చంపాడు. మృతులను తల్లి పద్మావతి, కూతురు ప్రత్యూషగా గుర్తించారు. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడు పోలీసుల ముందు లొంగిపోయినట్లు సమాచారం. హత్యలకు భూ వివాదమే కారణమని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

\

ఇవీ చదవండి:
కొత్త రకం మోసం: ఫిట్స్‌ వచ్చిన వాడిలా నటిస్తాడు.. ఆ తర్వాత..
సినిమా స్టైల్లో అదిరిపోయే ట్విస్ట్‌: నిన్న షాక్‌.. నేడు ప్రేమపెళ్లి

మరిన్ని వార్తలు