విషాదం: చెరువులో దూకిన తల్లి, కొడుకు

17 Sep, 2021 11:15 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

కర్నూలు: కర్నూలు జిల్లా సంజామ మండలం నోస్సం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. చెరువులో దూకి తల్లి, కొడుకు ఆత్మహత్యకు పాల్పడ్డారు. కాగా, వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహలను బయటకు తీసే ప్రయత్నాలు చేస్తున్నారు.

వీరి ఆత్మహత్యలకు కుటుంబ కలహలు కారణమని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.

చదవండి: ప్రియుడితో ఉండగా చూశాడని.. కొడుకు హత్య 

మరిన్ని వార్తలు