విషాదం: కూతుళ్లతో కలిసి తల్లి ఆత్మహత్య

19 Mar, 2021 07:20 IST|Sakshi

సాక్షి బళ్లారి: పిల్లల్ని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తల్లిని ఆర్థిక సమస్యలు ఉక్కిరిబిక్కిరి చేశాయి. దీంతో ఘోర నిర్ణయం తీసుకుంది. మహిళా రైతు ఇద్దరు కూతుర్లతో పొలంలోని ఫారంపాండ్‌లో దూకి ఆత్మహత్య చేసుకొంది. ఈ విషాదం జిల్లాలోని సిరుగుప్ప తాలూకాలో చోటు చేసుకుంది. గురువారం సిరుగుప్ప తాలూకా శాలిగనూరు గ్రామానికి చెందిన నాగరత్న (40), ఆమె కుమార్తెలు శృతి (12), గిరిజ (8)లతో కలిసి తమ పొలంలోని నీటి గుంతలో దూకి ప్రాణాలు తీసుకున్నారు.  

రూ.20 లక్షలకు పైగా రుణాలు  
నాగరత్నమ్మకు భర్త వీరేశగౌడతో కలిపి 3 ఎకరాల చేను ఉంది. పంటల సాగు కోసం బ్యాంకులో దాదాపు రూ.6 లక్షలు, ప్రైవేటు వ్యక్తులతో రూ.15 లక్షల రుణాలు చేసినట్లు స్థానికులు చెబుతున్నారు. ఇటీవల ఒక ఎకరా అమ్మి కొంత అప్పులు తీర్చారు. అయినప్పటికీ అప్పుల బాధను తాళలేక ఆత్మహత్య చేసుకొన్నట్లు తెలుస్తోంది. గ్రామంలో విషాద ఛాయలు అలముకొన్నాయి. సీఐ పవార్, ఎస్‌ఐ రంగయ్య ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను వెలికితీసి పోస్ట్‌మార్టం నిమిత్తం సిరుగుప్ప ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

మరిన్ని వార్తలు