సర్పంచ్‌ భర్తపై పారిశుధ్య కార్మికుడి దాడి

19 Jul, 2021 08:07 IST|Sakshi

సాక్షి, పెంబి(నిర్మల్‌): మండలంలోని వేణునగర్‌ గ్రామ సర్పంచ్‌ భర్త రమేష్‌పై గ్రామ పారిశుధ్య కార్మికుడు ఆదివారం సాయంత్రం ఇనుప రాడుతో తలపై దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి. బాధితుడు రమేష్‌ వివరాల ప్రకారం.. ప ల్లె ప్రకృతి వనంలో కార్మికుడు సోనేరావు రో డ్డుపై ట్రాక్టర్‌ నిలిపి మొక్కలకు నీళ్లు పోస్తున్నాడు.

రోడ్డుపై ట్రాక్టర్‌ నిలుపవద్దని, పక్కకు పె ట్టుకుని బకెట్‌తో నీళ్లు పోయాలని తెలుపగా సోనేరావు తనచేతిలోని ఇనుపరాడుతో దాడి చేశాడు. తలకు గాయం కావడంతో ఆసుపత్రిలో చికిత్స చేయించుకుని, అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు రమేష్‌ తెలిపాడు. 

>
మరిన్ని వార్తలు