jai bheem : నల్లగొండలో జైభీమ్‌ తరహా ఘటన.. వీడియో వైరల్‌

8 Dec, 2021 09:30 IST|Sakshi

సాక్షి, నల్లగొండ: నల్లగొండ జిల్లాలో జై భీమ్‌ సినిమా తరహా సన్నివేశం చోటు చేసుకుంది. కేసు నిమిత్తం ఓ దళిత యువకుడిని స్టేషన్‌కు పిలిచి.. అతడిని చితకబాదారు ఎస్సై, కానిస్టేబుల్‌. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో ఈ సంఘటనపై పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ఆ వివరాలు..
(చదవండి: మీ అబ్బాయి బాలికతో.. కేసు మాఫీ చేయాలంటే రూ.లక్ష ఇవ్వు)

నల్లగొండ టూటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఈ సంఘటన చోటు చేసుకుంది. భూ వివాదానికి సంబంధించన కేసులో ఓ దళిత యువకుడిని స్టేషన్‌కు పిలిపించాడు ఎస్సై నర్సింహులు. అనంతరం అతడిని చితకొట్టారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో.. పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వెల్లువెత్తాయి. విషయం కాస్త పెద్దది కావడంతో ఈ ఘటనకు బాధ్యులైన ఎస్సై నర్సింహులు, కానిస్టేబుల్‌ నాగుల్‌ మీరాను సస్పెండ్‌ చేశారు ఉన్నతాధికారులు. 

చదవండి: సఖ్యతకు అడ్డొస్తున్నాడని.. ప్రియుడితో కలిసి భర్త హత్య.. ఏమీ ఎరగనట్టు..

మరిన్ని వార్తలు