నెల్లూరు: జిల్లాలోని పొదలకూరు ఎస్బీఐ మేనేజర్ కీచకపర్వం వెలుగులోకి వచ్చింది. రుణాల కోసం వచ్చే మహిళపట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. వివరాలు.. పొదలకూరు ఎస్బీఐ మేనేజర్ నగేష్ మహిళా ఖాతాదారులతో అసభ్యంగా ప్రవర్తించేవాడు. రుణం కోసం వచ్చే మహిళలను మభ్యపెట్టి లోబర్చుకునేవాడు. నగేష్ వికృత చేష్టలు సీసీ కెమరాల్లో రికార్డవ్వడంతో అతడి దారుణాలు వెలుగులోకి వచ్చాయి.