జల్సా రాజా.. ప్రైవేట్​ విమానంలో ట్రిప్పులు, లగ్జరీ హోటల్​లో డిన్నర్​లు! దేశవిదేశాల్లో రోడ్డునపడ్డ యువతుల కన్నీటి కథలు

14 Feb, 2022 21:40 IST|Sakshi

అమ్మాయిలను పడేయడం అందరి వల్లా కాదురా.. అది ఒక ఆర్ట్​ అంటూ ఓ సినిమాలో డైలాగ్​ ఉంటుంది. కానీ, ఆ పడేయడంలోనూ సినిమాటిక్​ కోణాన్ని చూపించాడు ఓ గురుడు. ఈ టెక్నికల్​ ఏజ్​లో దేశ విదేశాల్లో అంతే హైటెక్​ మోసానికి పాల్పడ్డాడు. ఊహించని రేంజ్ విలాసాలను​ ప్రదర్శించడమే కాదు.. అమ్మాయిలను అంతే ఎమోషనల్​గా ముగ్గులోకి దించి చివరికి డబ్బుతో ఉడాయించాడు. ఆ దెబ్బకు దివాళా తీసి రోడ్డున పడ్డ ఆ అమ్మాయిలు.. తమ వ్యధను తెరపైకి ‘ది ట్విండర్​ స్విండ్లర్​’(ట్విండర్​ మోసగాడు) తీసుకొచ్చి హాట్​ టాపిక్​గా మారారు. 

The Twinder Swindler యూకేలో నెంబర్​ వన్​ నెట్​ఫ్లిక్స్​ సిరీస్​గా ఉంది. అంత క్రేజ్​ ఎందుకు అంటారా? అది ఒక వాస్తవిక గాథ కాబట్టి!. డేటింగ్​ పేరుతో ఓ వ్యక్తి చేసిన మోసం తాలుకా సాక్ష్యం ఇది. ది టిండర్​ స్విండ్లర్​ డాక్యుమెంటరీ.. గత కొన్నిరోజులుగా ట్రెండింగ్​లో నిలవడమే కాదు.. ఈ కేసులోని బాధితుల, నిందితుడి తరపున చర్చనీయాంశంగా మారుతోంది ఇప్పుడు.

ఆ మోసగాడి పేరు షిమన్​ హయత్​. ఇజ్రాయెల్​ డైమండ్​ మొఘల్​ లెవ్​ లెవెయివ్​ కొడుకుగా సిమన్​ లెవెయివ్​ పేరుతో ప్రచారం చేసుకుంటూ డేటింగ్​ యాప్​ టిండర్​లో డేటింగ్​ వ్యవహారానికి తెర లేపాడు. ప్రైవేట్​ విమానాల్లో విహారయాత్రలు, విలాసవంతమైన హోటళ్లలో లంచ్​లు డిన్నర్​లతో డేటింగ్​ చేసిన అమ్మాయిలకు గాలం వేసేవాడు. ఆపై ఎమోషనల్​ ట్రాప్​తో వాళ్ల నుంచి డబ్బు తీసుకుని ఉడాయించేవాడు. అలా ఎంత మందిని మోసం చేశాడో తెలియదు. కానీ, 10 మిలియన్​ డాలర్లకుపైనే మోసానికి పాల్పడినట్లు ఒక అంచనా.  

షిమన్​ దెబ్బకు అప్పుల పాలై పీకలి లోతు అప్పులోకి మునిగిపోయిన ముగ్గురు యువతులు.. ఫండ్​ రైజ్​ ద్వారా కోలుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ క్రమంలో ది ట్విండర్​ స్విండ్లర్ డాక్యుమెంటరీ వాళ్ల లాంటి ఎందరో బాధితులను వెలుగులోకి తీసుకొస్తోంది. తననూ ముగ్గులోకి దించే ప్రయత్నం చేశాడని, కానీ, అనుమానం రాగా.. తెలివిగా తప్పించుకున్నానని అర్జెంటీనాకు చెందిన ఓ యువతి వెల్లడించింది. అయితే 200 కే మిలియన్ల ఫాలోవర్స్​ ఉన్న షిమన్​.. తన ఇన్​స్టాగ్రామ్​ అకౌంట్​ను డిలీట్​ చేయడంతో పాటు ఈ వ్యవహారంలో తనను ఇరికించే కుట్ర జరుగుతుందంటూ చివరి మెసేజ్​ను ఉంచడం కొసమెరుపు.
 

రివెంజ్​ తీర్చుకునేందుకు బాధిత యువతులందరూ ఏకమవుతున్న తరుణంలో.. షిమన్​ కౌంటర్​ యాక్షన్​ ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. 2020లో ఇజ్రాయెల్​ కోర్టు కేవలం 47 వేల డాలర్లు మాత్రమే చెల్లించాలంటూ తక్కువ శిక్షతో సరిపెట్టడం బాధితులను స్థిమితంగా ఉండనివ్వడం లేదు. తమ ఆత్మాభిమానాన్ని దెబ్బ తీయడంతోపాటు శారీరకంగా, ఆర్థికంగా దోచుకున్న ఆ జల్సా రాజాకి సరైన గుణపాఠం చెప్పాలని పోరాడుతున్నారు. వీళ్లకు మద్దతు ఇచ్చే వాళ్లు కొందరైతే.. గుడ్డిన నమ్మి మోసపోయారంటూ బాధితులనే తిట్టిపోసేవాళ్లు మరికొందరు!. 

మరిన్ని వార్తలు